ఆర్మీ క‌మాండ‌ర్ల స‌ద‌స్సు వాయిదా

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం, పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్ మ‌రికొన్ని రోజులు పొడిగిస్తార‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ నెల 16న జ‌రుగాల్సిన భార‌త‌ ఆర్మీ క‌మాండ‌ర్ల ద్వైవార్షిక స‌ద‌స్సు వాయిదా ప‌డింది. కొవిడ్‌-19 కార‌ణంగా సదస్సును వాయిదా వేస్తున్నట్టు భారత ఆర్మీ ప్రకటించింది. మ‌న దేశం లోప‌ల‌, దేశం చుట్టుపక్కల భద్రతా పరిస్థితితోపాటు ఇత‌ర‌ కీలక అంశాలపై ఈ స‌మావేశంలో ఆర్మీ క‌మాండ‌ర్ల‌తో చర్చించాలని భార‌త భ‌ద్ర‌తా ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్ భావించార‌ని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపిన ఆర్మీ వ‌ర్గాలు.. తిరిగి స‌మావేశం ఎప్పుడు నిర్వ‌హిస్తారో వెల్ల‌డించ‌లేదు.